మునుగోడు బైపోల్..బీజేపీ డబ్బుల ఎర

153
munugodu by poll
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల నుండి ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతు కరువవడంతో కాషాయ నేతలు డబ్బుల పంపిణీపై ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పెద్ద ఎత్తున మునుగోడుకు డబ్బును తరలిస్తుండగా తనిఖీల్లో భాగంగా బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు.

తాజాగా పక్కా సమాచారం మేరకు చల్మడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేయగా కోటీ రూపాయల నగదు పట్టుబడింది. క్యాష్ తో పాటు కారును కూడా సీజ్ చేశారు పోలీసులు. డబ్బు తరలిస్తున్న వాహనం కరీంనగర్ కు చెందిన బీజేపీ నేత సొప్పరి వేణుకి చెందినదిగా గుర్తించారు. ఆయన భార్య కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్.

మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతో విజయవాడకు చెందిన రాము దగ్గరి నుంచి కోటి రూపాయలు తీసుకుని మునుగోడు వెళ్తున్నట్లు వేణు చెప్పాడన్నారు పోలీసులు. సీజ్ చేసిన డబ్బుని ఐటీ అధికారులకు అప్పగించారు.

- Advertisement -