మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పరిశీలకుల నియామకం..

119
election
- Advertisement -

రాష్ట్రంలో పలు నగరాల్లో మున్నిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. ఇందుకోసం ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ లకు,మున్సిపాలిటీ లకు వ్యయ,సాధారణ పరిశీలకులను తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కు సాధారణ పరిశీలకులుగా క్రిస్టినా,వ్యయ పరిశీలకులుగా దేవేందర్‌ను నియమించింది. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ సాధారణ పరిశీలకులుగా అహ్మద్ నదీమ్ వ్యయ పరిశీలకులుగా రాజును.. అచ్చంపేట్ మున్సిపాలిటీ సాధారణ పరిశీలకులుగా కిషన్,వ్యయ పరిశీలకులుగా శ్రీనివాస్ బాబు..సిద్దిపేట మున్సిపాలిటీ సాధారణంగా పరిశీలకులుగా టికే శ్రీదేవి,వ్యయ పరిశీలకులుగా వేణు మాధవ్ రెడ్డి నియమితులైయ్యారు. అలాగే నకిరేకల్ మున్సిపాలిటీ సాదారణ పరిశీలకులుగా వాకాటి కరుణ,వ్యయ పరిశీలకులుగా ఎల్ నర్యా. కొత్తూర్,జడ్చర్ల మున్సిపాలిటీ లకు సాధారణ పరిశీలకులుగా శ్రీధర్,వ్యయ పరిశీలకులుగా సిహెచ్ శ్రీనివాస్ నియమించబడ్డారు.

- Advertisement -