IPL 2024 :ఆ రెండు జట్ల పనైపోయిందా?

20
- Advertisement -

ఐపీఎల్ 17 వ సీజన్ ఎవరి ఊహలకు అందడం లేదు. ఒకప్పుడు పాయింట్ల పట్టికలో కింద ఉండే సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ వంటి జట్లు ఈ సీజన్ లో అత్యద్భుతంగా రాణిస్తున్నాయి. అలాగే గతంలో విధ్వంసక ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరుగా నిలిచిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్.. వంటి జట్లు ఈ సీజన్ లో చతికిల పడుతున్నాయి. దాంతో ఈ 17 వ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరనేది అంచనా వేయడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇప్పటివరకు రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండగా, రెండో స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్, మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో స్థానంలో లక్నో, ఐదో స్థానంలో హైదరాబాద్ జట్లు కొనసాగుతున్నాయి. ఇక పాయింట్ల పట్టిక చివర్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు ఉన్నాయి.

ఆ రెండు జట్ల పనైపోయిందా

సీజన్ ప్రారంభానికి ముందు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు వరుస పరాజయాలతో సతమతమవుతున్నాయి. ముంబై ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు అడగా.. మూడింట్లోనూ ఓటమి చవి చూసింది. అటు ఆర్సీబీ కూడా ఐదు మ్యాచ్ లు ఆడగా అందులో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. దాంతో ఈ రెండు జట్లు తిరిగి ఎప్పుడు పుంజుకుంటయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డబుల్ ధమాకా

నేడు జరిగే ఐపీఎల్ మ్యాచ్ లలో అభిమానులకు డబుల్ ట్రీట్ లభించనుంది. మొదట మద్యాహ్నం 3:30 కి ముంబై ఇండియన్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలవడం ముంబైకి ఎంతో ముఖ్యం. అటు డిల్లీ కూడా రేస్ లో నిలబడేందుకు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఇక రాత్రి 7:30 లక్నో మరియు గుజరాత్ జట్లు తలప్దనున్నాయి.

Also Read:టిల్లు కోసం వస్తున్న దేవర!

- Advertisement -