IPL 2023:ఎట్టకేలకు బోణి కొట్టిన ముంబై

58
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా ఎట్టకేలకు బోణి కొట్టింది ముంబై. ఢిల్లీ కెపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి టార్గెట్‌ని చేధించింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లతో 65, తిల‌క్ వ‌ర్మ 29 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లతో 41, ఇషాన్ కిష‌న్‌(31) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేష్ కుమార్ రెండు వికెట్లు తీయ‌గా, ముస్తాఫిజుర్ రెహమాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.4 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అక్ష‌ర్ ప‌టేల్‌ 25 బంతుల్లో 4ఫోర్లు, 5 సిక్స‌ర్లు 54, డేవిడ్ వార్న‌ర్‌ 47 బంతుల్లో 6ఫోర్లతో 51 పరుగులతో రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్, పీయూష్ చావ్లా చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, రిలే మెరిడిత్ రెండు, హృతిక్ షోకీన్ ఓ వికెట్ తీశాడు. ఈ విజ‌యంతో ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతా తెరిచింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -