ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, తర్వాతి సినిమాను కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు తెర దించుతూ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ ఫుల్ కిక్ ఇచ్చింది.
ఇక జూ.ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీని రెండు పార్ట్లుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మొదటి పార్ట్ 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ పార్ట్లో కోస్టల్కు సంబంధించిన సీన్లను చిత్రీకరించినట్టు శివ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అన్నట్టు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్2 చేయనున్నాడు. ఇదిలా ఉంటే వార్2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ గురించి డిస్కస్ చేయడానికి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చి తారక్ను కలిసి వెళ్లాడని సమాచారం. దేవర సినిమా షూటింగ్ అయిపోగానే ఎన్టీఆర్ వార్2 షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.
Also Read:ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా.. మోడీజీ !