వైసీపీలోకి ముద్రగడ..ముహుర్తం ఫిక్స్

15
- Advertisement -

కాపు సామజికవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు ముద్రగడ. తన కుమారుడితో పాటు నేను సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని తెలిపారు. తాను ఏలాంటి పదవులు ఆశించడం లేదని ఈ సందర్భంగా తెలిపారు.

భగవంతుడు దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నాను అని చెప్పారు. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు. ఇప్పటికే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Also Read:భీమా..ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: గోపీచంద్

- Advertisement -