సీఎం కేసీఆర్ కు స్వామినాథన్ ప్రశంసలు

222
KCR
- Advertisement -

రాష్ట్రంలో సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంపై ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను అభినందిస్తూ ఆయన ఓ లేఖ రాశారు. రాష్ట్ర రైతులకు 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరాపై చేసిన ప్రకటన తనకు ఎంతగానో సంతోషం కలిగించిందని తెలిపారు.

CMKCR

ప్రత్యేకించి తెలంగాణలో ఎక్కువభాగం మెట్ట ప్రాంతమైనందున ఈ నిర్ణయం రైతులకు గొప్ప వరంలాంటిదని పేర్కొన్నారు. పంటలను కాపాడే సాగునీరు వ్యవసాయ విజయానికి అత్యంత కీలకమని అన్నారు. సాగునీటి భద్రతలో అత్యంత కీలకమైన భాగంలో రైతులకు సహకరించేలా తీసుకున్న ఈ నిర్ణయంపట్ల మొత్తం రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆ లేఖలో స్వామినాథన్ తెలిపారు.

Swaminathan-

మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలతో, మీ కలలను సాకారం చేసుకునేలా ఈ సంవత్సరం ఉండాలని ఆకాంక్షిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని స్వామినాథన్ తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -