సినీరంగంలోకి ధోని..

125
ms
- Advertisement -

భారత మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినీ రంగంలోకి అడుగుపెట్టారు. D ఎంటర్టైన్మెంట్ పేరుతో చెన్నైలో తన ప్రొడక్షన్ ఆఫీస్ ని ఓపెన్ చేశారు ధోని. తన మొదటి సినిమాని తమిళ్ లో నిర్మించనున్నారు.

ఈ సినిమాకి ధోని భార్య సాక్షి కథని అందించగా రమేష్ తమిళమని దర్శకత్వం వహించబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమా తెరకెక్కనుండగా నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

భారత క్రికెట్ కి ఎన్నో విజయాలు, వరల్డ్ కప్ అందించిన గొప్ప క్రికెటర్ ధోని…యాడ్స్‌తో పాటు పలు బిజినెస్‌లలో బిజీగా ఉన్నారు.

- Advertisement -