తహసిల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు పూర్తి

432
MRO-Vijaya
- Advertisement -

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ తహసిల్దార్ విజయరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాగోలు శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు అధికారులు. విజయా రెడ్డి చితికి ఆమె భర్త సుభాష్‌ రెడ్డి నిప్పంటించారు. అంతకుముందు గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కాగా కొత్తపేటలోని విజయా రెడ్డి నివాసం నుంచి మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమైంది.

ఈ అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు పాల్గోన్నారు. ఎమ్మార్వో విజయా రెడ్డిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గుర్నాథం కూడా మృతి చెందడం మరో విషాదంతో విషాదం నెలకొంది. ఈ ఘటనలో అటెండర్ చంద్రయ్య, నారాయణ అనే మరో రైతు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మార్వోపై దాడికి పాల్పడ్డ నిందితుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -