ఆ రోజుల్లో చాక్లెట్స్‌తో పనైపోయేది..!

237
akhil
- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ మజ్ను. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకోగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

టీజర్‌లో ‘మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినపుడు మీరేం చేసేవారు?’ అంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకు ‘చాక్లెట్ తినేదాన్ని’ అని హీరోయిన్‌ చెప్పగా ‘ఆరోజుల్లో చాక్లెట్స్‌తో పనైపోయేది. కానీ, టుడేస్ స్ట్రెస్ లెవల్స్‌కి హ్యూమన్ టచ్ కావాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది.

టీజర్‌ విడుదలైన కొద్దిగంటల్లోనే నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -