పరిషత్‌ పోరులో దూసుకుపోతున్న కారు..

380
trs car
- Advertisement -

ప్రజలంతా టీఆర్ఎస్ వైపే నిలిచారు. మండల పరిషత్‌ పోరులో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తున్నారు. గులాబీ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలకడంతో పలు మండలాలను క్వీన్ స్వీప్ చేసింది టీఆర్ఎస్. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ 2938 ఎంపీటీసీ స్ధానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 1041,బీజేపీ 187 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా ఇతరులు 355 స్ధానాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇక జడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు 12 ఫలితాలు వెల్లడికాగా 12 స్ధానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తంగా స్ధానికసంస్థల్లో 75 శాతంపైగా సీట్లను కైవసం చేసుకుని టీఆర్ఎస్ సత్తాచాటింది.

ఇక నిజామాబాద్‌లో కారు దూకుడు ముందు కాంగ్రెస్,బీజేపీ అడ్రస్ లేకుండా పోయాయి. ఇప్పటివరకూ వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 25, బీజేపీ 10, స్వతంత్ర్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శంకోర టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి మూడ్ పద్మ వసంత్ రావు 74 తో గెలుపొందారు.ఆలూరు-2 టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ ,నూత్‌పల్లిలో స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్,కొప్పర్గలో టీఆర్%8

- Advertisement -