ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం:నామా,కవిత

379
nama kavitha
- Advertisement -

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు ఎంపీలు నామా నాగేశ్వరరావు,కవిత. ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్ర అన్నారు ఎంపీ నామా. స్ధానికంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నామా తనకు భారీ మెజార్టీ అందించిన ప్రజలకు,నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీఫాం ఇచ్చి ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సీతారామ ప్రాజెక్ట్ కోసం నా వంతు కృషి చేసి, ప్రజలకు అంకింతం చేస్తానని చెప్పారు.పార్లమెంట్ లో నాకున్న అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర హక్కుల కోసం పని చేస్తానని చెప్పారు నామా.

సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే మహబూబాబాద్‌లో కవిత గెలుపుకు కారణమైందని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు.తనకు టిఆర్ ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిన సీఎం కేసీఆర్ కి,కేటీఆర్ కి,మంత్రి దయాకర్ రావు కి,పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యే లకు,ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు కవిత.చెప్పిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ములుగుని జిల్లా చేశాడు కాబట్టే తన గెలుపు సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు స్ధానిక నేతలు పాల్గొన్నారు.

- Advertisement -