మొక్కలు నాటిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

472
vijaya sai reddy
- Advertisement -

తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు దూసుకుపోతోంది. ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలోని పెద రిషికొండ జీవీఎంసీ పార్క్‌లో మూడు మొక్కలు నాటారు.

అనంతరం మరికొందరికి ఈ ఛాలెంజ్‌లో విసిరారు. ఇందులో భాగంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సిబ్బందిని నామినేట్ చేశారు. కాగా, దీనిపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటినందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -