మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణాధారం: ఎంపీ సంతోష్

55
Mp santosh
- Advertisement -

కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా షౌండేషన్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి మద్దతివ్వాలని ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్, శైలజ, రాఘవ తదితరులు ఎంపీ సంతోష్ కుమార్ ను కోరారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ‘‘హరా హైతో భరా హై’’ అనే గొప్ప నినాదంతో 17 జూలై 2018న తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి, అనుకున్న లక్ష్యాన్ని చేరిందని ఈశా ఫౌండేషన్ సభ్యులకు వివరించారు. మట్టికి – మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నట్లే ఈశా ఫౌండేషన్ చేపట్టిన సేవ్ సాయిల్ ఉద్యమానికి, తాము చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి కూడా అదే సంబంధం ఉంటుందని ఎంపీ సంతోష్ అన్నారు. అందుకే ‘మట్టిని కాపాడుకుందాం – మొక్కను బతికించుకుందాం’ అని ఆయన అన్నారు. సేవ్ సాయిల్ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

ఈశా ఫౌండేషన్ చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను ఎంపీ సంతోష్‌కు ఈశా ప్రతినిధులు తెలియజేశారు. సద్గురు ఆధ్వర్యంలో ‘సేవ్ సాయిల్’ ఉద్యమాన్ని చేపట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటనలను విజయవంతమయ్యాయని, ప్రస్తుతం ప్రపంచ యాత్ర జరుగుతున్నదన్నారు. ఆ యాత్రా విశేషాలను ఎంపీ సంతోష్ కు వివరించారు. అలాగే, త్వరలోనే హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేయబోయే ‘సేవ్ సాయిల్’ ఉద్యమ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంపీ సంతోష్ కుమార్ ను ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ తప్పక హాజరవుతానని,’సేవ్ ఆయిల్’ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -