“శివయ్యకు కోటి వృక్షార్చన” పాటను విడుదల చేసిన ఎంపీ సంతోష్..

147
MP Santhosh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ ఆధ్వర్యంలో రూపొందించిన “ఎందో నీ మాయ శివయ్యకు కోటి వృక్షార్చన” పాటను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈరోజు బేగంపేటలో విడుదల చేశారు.

ఈ పాట విన్న సంతోష్ కుమార్ చాలా చక్కగా పాటను తీసారు అని భక్తి భావంలో కూడా పచ్చదనాన్ని గురించి చాలా చక్కగా వివరించారు అని కొనియాడారు. ఈ పాటలో ఉపయోగించిన శివ లింగాన్ని పచ్చని ఆకులతో తయారు చేయడం నాకు చాలా బాగా నచ్చింది అని తెలిపారు. ఈ పాటను రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. మానవుని చివరి జీవితంలో కూడా ఏదైనా సాధించవచ్చని ఈ పాట ద్వారా తెలపడానికి ప్రయత్నం చేశామని.. జీవితంలో చివరి ఘట్టమైన స్మశానంలో పచ్చని శివలింగం పెట్టడం జరిగిందని తెలిపారు. దీనికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తి తీసుకున్నామని అన్నారు. మొత్తం ఎండిపోయిన మొక్క కూడా చిన్న చిగురు ద్వారా మహావృక్షం అవుతుంది అని అదేవిధంగా జీవితంలో ఎప్పుడు కూడా అధైర్య పడవద్దని మన మొక్కవోని ధైర్యంతోనే ముందుకు కొనసాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపారు.

ఈ పాటకు నటుడు, రచయిత తనికెళ్ల భరణి సలహాలు సూచనలు, రచయిత కాసర్ల శ్యామ్, డైరెక్టర్ సాయి కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, నటుడు ధన్ రాజ్, తెలంగాణ సుజాత, సురేష్, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -