చిరంజీవులుకు ధన్యవాదాలుఃఎంపీ సంతోష్ కుమార్

399
Mp Santhosh chiranjevlu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. పలువురు సినీ, రాజకీయ నాయకులు మొక్కలను నాటి సోషల్ మీడియా ద్వారా మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించిన మొక్కలు నాటిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌ కమిషనర్ టి.చిరంజీవులుకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్ ఛెలెంజ్ ను స్వీకరించినందుకు చాలా సంతోషం… మీరు చాలా మందికి స్పూర్తిగా నిలుస్తారని ట్వీట్ చేశారు.

టీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌ కమిషనర్ టి.చిరంజీవులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్‌కు కారణమైన జోగినపల్లి సంతోష్ కుమార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గ్రీన్ ఛాలెంజ్ యజ్ఞంలో ఎందరో పాల్గొంటున్నారు…పచ్చదనాన్ని పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

- Advertisement -