MP Santhosh:ఉప్పల్‌ భగాయత్‌లో గ్రీన్ ఛాలెంజ్..

29
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లేఔట్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ప్రతిఒక్కరిని ఎంపీ సంతోష్‌ అభినందించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాలలో హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పచ్చదనం గురించి చైతన్యం తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఎంతో పచ్చదనం పెరగడం జరిగిందని అన్నారు.

తెలంగాణ హరితోత్సవం లో బాగంగా ఉప్పల్ భగాయత్ HMDA లే ఔట్ లో మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి ఎంపీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ హరితోత్సవం లో బాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి ఉప్పల్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటుతున్నారు.హరితహారం,గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా గ్రీనరి పెరిగిందని అన్నారు..

ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి,రాఘవ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు స్థానిక బిఅరెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -