ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం అనే మహాయజ్ఞాన్ని చేపట్టారు. ఈ హరితహారానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్ల మైలురాయిని అధిగమించగా దేశవిదేశాల్లో గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నారై టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఛాలెంజ్ను స్వీకరించి అమెరికాలో మొక్కలు నాటి అనంతరం పలు దేశాల్లోని టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులను నామినేట్ చేశారు.
టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రల నాగరాజు ఛాలెంజ్ను స్వీకరించి స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. 60 మొక్కలను పంపిణీ చేసి విద్యార్థులతో నాటించారు. మొక్కలు నాటడంతో నాగరాజుపై ప్రశంసలు గుప్పించారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ ఛాలెంజ్కి మరికొంతమందిని నామినేట్ చేయడమే కాదు విద్యార్థులను భాగస్వాములను చేయడం గొప్పవిషయం అన్నారు.
Amazing feeling all together, as I have come to know that @TrsNagaraju Head of TRS, South Africa has accepted the nomination from @mbigala as part of #GreenIndiaChallenge and planted saplings in Pretoria, SA. Heartening to see they have also distributed saplings among students. https://t.co/WOPgA1KUL3
— Santosh Kumar J (@MPsantoshtrs) October 14, 2019