వనజీవి రామయ్యకు హ్యాట్సాఫ్:ఎంపీ సంతోష్

54
mp santhosh nd ramayya
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన సతీమణి తో కలిసి ఖమ్మం రహదారి మార్గంలో విత్తనాలు జల్లిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యకు ఎంపీ సంతోష్ కుమార్ హ్యాట్సాఫ్ చెప్పారు.

ఆరోగ్యం సహకరించకున్న ఆయన మనసు మొక్కల పెంపకం వైపే లాగుతుంది.పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తన సతీమణి జానమ్మ తో ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డి పల్లి-ముత్తగూడెం రహదారి మార్గంలో చిన్న చిన్న గుట్టలపై విత్తనాలు జల్లారు. రోడ్డు ప్రమాదానికి గురై ఇటీవలే ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన సతీమణితో కలిసి విత్తనాలను వ్యాప్తి చేయడం ద్వారా మాలో స్ఫూర్తి నింపినందుకు రామయ్య గారూ హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -