సొంత గ్రామంలో నిత్యాన్నదానం చేస్తున్న సంతన్న..

303
food distribution
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్ 13వ రోజుకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపు మేరకు తెలంగాణలో ఆకలి కేకలు వినిపించద్దు అని చెప్పిన మాటకు కట్టుబడి తన స్వంత గ్రామం అయిన కుదురుపాకలో నిత్యాన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ క్యాంప్ లాక్‌డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని టీఆరఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు విధిగా మస్కులు ధరించాలని, సామజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించి కరోనాని తరిమి కొట్టాలి అని తెలిపారు.

food distribution program

మా ఊరి ముద్దుబిడ్డ, నా బాల్య మిత్రుడు రాజ్యసభ సభ్యులు కావడం, చిన్ననాటి మిత్రులందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వాంగా ఉంది అని, వలస కార్మికులకి, పేద కుటుంబీల కోసం నిత్యాన్నదానం కార్యక్రమం చేపట్టి ఆకలితో ఉన్న వాళ్లకి అన్నం పెట్టడం, మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగయ్య, గ్రామశాఖ TRS అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, TRS నాయకులు, చింతలపల్లి తిరుపతి రెడ్డి, ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయబు రాజీరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -