12వ రోజుకు చేరిన సంతన్న నిత్యాన్నదానం..

197
- Advertisement -

బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమం 12వ రోజుకి చేరుకుంది. మాకు ప్రతి రోజు భోజనం పెడుతూ,కంటినిండా నిద్ర పోయే భరోసా కల్పిస్తున్నారని వలస కూలీలు, దినసరి కూలీలు, గ్రామంలో ఉండే నిరుపేద కుటుంబాలు ఎంపీ సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా కొనియాడారు.

ఈ క్యాంప్ లాక్‌డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని అలాగే ప్రతి ఒక్కరు విధిగా మస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించాలి, స్వీయ నిర్బంధంలో ఉండాలి ఇలా ప్రతి రోజు స్థానిక ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నారు టీఆరఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, టీఆర్‌ఎస్ నాయకులు, చింతలపల్లి తిరుపతి రెడ్డి, ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయబు రాజీరెడ్డి, శ్రీనివాస్ గార్లు పాల్గొన్నారు.

- Advertisement -