17వ రోజు.. ఎంపీ సంతోష్ అన్నదానం..

216
mp santhosh
- Advertisement -

బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్ 17వ రోజుకు చేరింది. కోదురుపాక టీఆర్‌ఎస్‌ యువ నాయకులు భోజనాలు వడ్డించారు. ఈ క్యాంప్ లాక్‌డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, సామాజిక దూరం పాటిచాలి అని ప్రతి రోజు అన్నదాన కేంద్రం వద్ద కరోనాని అరికట్టడానికి అవగాహనా కలిపిస్తున్నారు.

food

మా ఊరి ముద్దుబిడ్డ ఇంతలా కార్మికుల కోసం ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, టీఆర్‌ఎస్‌ నాకులు, ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, గుండ్ల సాయబు పాల్గొన్నారు.

- Advertisement -