ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

140
Revanth reddy
- Advertisement -

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన? అని లేఖ‌లో ప్ర‌శ్నించిన రేవంత్.. పాల‌మూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న ఎంపీ అరవింద్ హామీ ఏమైందని అడిగారు. మీ దృష్టిలో తెలంగాణకు అంత ప్రాధాన్య‌త ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. నైనీ కోల్ మైన్స్ అవినీతి టెండర్ల విషయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్ర‌శ్నించిన రేవంత్…. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు ఎందుకు త‌ర‌లించారో చెప్పాల‌న్నారు.

- Advertisement -