ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

49
- Advertisement -

అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అవసరం లేదని..కేవలం 8 గంటల కరెంట్‌ ఇస్తామని ప్రకటించారు.

Also Read:భారీ వర్షాలు..తెలంగాణ భవన్‌ని సంప్రదించండి

ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్‌ ఎందుకు అని ప్రశ్నించారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్‌ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలపై ప్రజల నుండే కాదు కాంగ్రెస్ నేతల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -