- Advertisement -
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటారు.ఎంపీ రవిచంద్ర గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ,ప్రతినిధి సతీష్ సహకారంతో తన సన్నిహితులు మర్రి రంగారావు,నీలం దుర్గేష్, వేల్పుల రాజమల్లుతో కలిసి రెండు మొక్కలు నాటడడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, పుట్టినరోజులు,ఇతర శుభదినాల సందర్భంగా మొక్కలు నాటడడం అనేది పుణ్య కార్యమన్నారు.పచ్చదనాన్ని పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణకు రాజ్యసభ మాజీ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఎంతో మంది స్ఫూర్తినొంది ఇప్పటివరకు 17కోట్లకు పైగా మొక్కలు నాటడడం జరిగిందని ఎంపీ రవిచంద్ర వివరించారు.
Also Read:ఎటు చూసినా నోట్ల కట్టలే!
- Advertisement -