నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ రంజిత్ రెడ్డి..

281
mp ranjith reddy
- Advertisement -

ఈరోజు ఢిల్లీలో ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ పలు అంశాలను నితిన్‌ గడ్కరీతో చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ‘భరత్ మాల పరియోజన’ ప్రోగ్రాం కింద సుమారు 1948 కి.మీ.ల ఎన్‌హెచ్‌లను చేర్చినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఎంపీ రంజిత్ రెడ్డి. ఈ ప్రాజెక్ట్‌లలో ఒకటి.. “హైదరాబాద్ (ORR అప్పా జంక్షన్) నుండి మన్నేగుడ NH-163 యొక్క నాలుగు లైన్ల రోడ్డుకి ఎంపీ ప్రతిపాదించారు.

NHAI ఇప్పుడు ఈ ప్రాజెక్టును వదలివేయడానికి ఒక నిర్ణయం తీసుకుందని తెలిసింది మరియు పై ప్రాజెక్టుకు సంబంధించి మరింత భూసేకరణ ప్రక్రియను ఆపడానికి ఆదేశాలు ఇవ్వబడుతున్నాయి. ముఖ్యమంత్రి తన D.O.లేఖ తేదీ 25 జూలై, 2019న ‘భరత్ మాల పరియోజన’కింద పై ప్రాజెక్టును చేపట్టాలని స్వయంగా అభ్యర్థించారని ఎంపీ గడ్కరీకి తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతున్న దశలో ఉన్నందున, ఈ ప్రాజెక్టును ‘భారత్ మాల పరియోజన’ నుండి తీసివేయడం వల్ల స్వాధీనం చేసుకున్న భూములను భూ యజమానులు ఆక్రమించు కొనే అవకాశం ఉంది. అలాగే భూసేకరణకు ఖర్చు చేసిన డబ్బు వృధా అవుతుంది. కావున ఈ ప్రాజెక్టును ‘భారత్ మాల పరియోజన’ కింద మాత్రమే చేపట్టాలని దయతో పరిశీలించాలని నితిన్ గడ్కరినీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అభ్యర్థించారు.

- Advertisement -