తెలంగాణ ప్రజలను అవమానించిన మోడీ: నామా

45
nama
- Advertisement -

తెలంగాణ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవమానించారు ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతుందని, ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారని.. ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారన్నారు.

బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తున్నదని విమర్శించారు.

- Advertisement -