పార్లమెంట్ లో ప్రొటెం స్పీకర్ గా మేనకా గాంధీ?

421
Maneka Gandhi
- Advertisement -

కేంద్రంలో ఎన్డీయే రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 17నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. లోక్ సభ సమావేశాల్లో భాగంగా తొలి ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేపిస్తారు.

ఇక ప్రొటెంస్పీకర్ గా ఎంపీ మేనకాగాంధీ పేరు వినిపిస్తుంది. ఈసారి ఆమెకు మంత్రి వర్గంలో చోటు దక్కక పోవడంతో ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట బీజేపీ అధిష్టానం. ప్రమాణస్వీకారం అనంతరం ఈసమావేశాల్లోనే కొత్త స్పీకర్ ను ఎన్నుకుంటారు. ఇక స్పీకర్ గా సీనియర్ పార్లమెంటేరిన్ గా ఉన్నా సంతోష్ గంగ్వార్ పేరు వినిపిస్తుంది.

- Advertisement -