కేసీఆర్ నిర్ణయాలతోనే కరోనా కట్టడి: ఎంపీ బడుగుల

253
MP Lingaiah Yadav On Corona
- Advertisement -

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఈరోజు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం కరోనా లక్‌డౌన్‌ పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి మనుగడకే ముప్పులా తయారయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ లాంటి కఠిన నిర్ణయాలతోనే మన రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోగలిగామన్నారు.

నల్లగొండ జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు గాను ఇప్పటికే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము. 3 కోట్ల గన్నిబ్యాగులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశాము. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా లారీలు పంపించి కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. ఇక కాంగ్రెస్ నాయకులు వారి మనుగడ కాపాడుకోవడం కోసం అనవసర విమర్శలు చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య అన్నారు.

- Advertisement -