సిరాజుద్దీన్ మృత దేహానికి ఎంపీ కొత్త ప్రభాకర్ నివాళి..

351
MP Prabhakar Reddy
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు సిరాజుద్దీన్ మృత దేహానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,నందిని సిద్దారెడ్డి, ఫరూక్ హుస్సేన్ నివాళ్ళు అర్పించించారు.. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ:కామ్రేడ్ సిరాజుద్దీన్ ఈ ప్రాంతానికి ఎనలేని సేవా చేశారు.కార్మికులకు ,కర్షకులకు ప్రాంత ప్రజలకు సేవ చేసి వారి మన్నానలు పొంది ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు
ఎంపీ కొత్త ప్రభాకర్ అన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం,ఆయన ఆత్మ శాంతించాలి,వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.తెలంగాణ సాధనలో కూడా ముందుండి పోరాడారు.కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చారని ఎంపీ తెలిపారు.

నందిని సిద్దారెడ్డి మాట్లాడుతూ:కామ్రేడ్‌గా కమ్యూనిస్టు పార్టీ గౌరవం పొందడమే కాకుండా ఇక్కడ ప్రజల చేత కొనియడబడ్డారు.అన్ని రంగాల కార్మికులందరిని సంఘటితం చేసి నిరంతరం మేడే స్ఫూర్తిని కార్మికుల్లో నింపారని నందిని సిద్దారెడ్డి అన్నారు.సుదీర్ఘ కాలంగా కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ అస్తిత్వంతో నిలబడింది అంటే అది సిరాజుద్దీన్ వల్లే నిలబడింది.కార్మిక సంఘాలు నిర్మాణం చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.

కార్మిక సమస్యలు పరిష్కారం చేసినా సేవా దృక్పథం గలా వ్యక్తి.ఆయన జీవితం అంతా కూడా ప్రజల అభివృద్ధి కొరకు ఆయన చేసిన కృషి ప్రశంసనియం.ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది.ఆయన ఆత్మకు శాంతిచేకూరలని.. ఆయన స్ఫూర్తితో కార్మికుల ఉద్యమం నిర్మాణం జరగాలి అని సిద్దారెడ్డి అన్నారు.

- Advertisement -