వైభవంగా పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుక- కేకే

111
kk
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎంపీ, పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ కె.కేశవరావు తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్న శాసన మండలి సభ్యురాలు వాణి దేవి, చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మరియు హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి నెక్లెస్ రోడ్డును ఆయన సందర్శించారు.

ఈనెల 28న పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని నెక్లెస్‌ రోడ్డు నందు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనువైన వివిధ స్థలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు కేకే తెలిపారు. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా మార్చుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

- Advertisement -