కల్నల్ సంతోష్ బాబుకు ఎంపీ సంతోష్ కుమార్ నివాళి

232
mp santhosh
- Advertisement -

చైనా భారత్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే. నేడు కల్నల్ సంతోష్ బాబుకు నివాళి అర్పించారు రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లారు ఎంపీ సంతోష్. ఈ సందర్భంగా సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతోష్ బాబు మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

కాగా నేడు సంతోష్ బాబు కుటుంబ సభ్యలను పరామర్శించారు సీఎం. అనంతరం ఆయన భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. దాంతో పాటు రూ.5కోట్ల చెక్కు, బంజరాహిల్స్‌ లో 570 గజాల స్థలం డాక్యుమెంట్లను అందజేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు సంతోష్ బాబు తల్లితండ్రులు.

- Advertisement -