మొక్క‌లు నాటిన మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్

346
santoshmallareddy\
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది.గ్రీన్‌ ఛాలెంజ్‌ మూడవ విడత కార్యక్రమంలో భాగంగా నేడు శామీర్‌పేటలోని బిట్స్‌పిలానీ క్యాంపస్‌ ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో పాటు మంత్రి మల్లారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత కీసర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో మంత్రి మల్లా రెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు , ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ ,మాధవరం కృష్ణారావు , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ , టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,ZP చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి స్ధానిక‌ ప్రజా ప్రతినిధులు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -