కేసీఆర్‌ను మించిన నాయకుడులేరు: ఓవైసీ

123
owaisi
- Advertisement -

సీఎం కేసీఆర్‌ను మించిన నాయకుడు దేశంలో లేరన్నారు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేసీఆర్‌ మొండి మనిషి …గతంలో కంటే యాక్టివ్‌ అయ్యారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ యాక్టివ్‌గానే ఉండాలని…. దేశ రాజకీయాలపై కేసీఆర్‌ పిలుపు కోసం వేచి చూస్తున్నాని తెలిపారు.

కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయవద్దన్న ఆయన.. దేశంలోనూ రాష్ట్రంలోనూ కేసీఆర్ రాజకీయాలలో తనదైనశైలీలో చక్రం తిప్పుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదని తెలిపారు ఓవైసీ. బుల్డోజర్ సింబల్ తెలంగాణలో ఎట్టిపరిస్థితిలో నడవదంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -