భైంసా అల్లర్లు..చర్యలు తీసుకోండి: ఓవైసీ

173
owaisi
- Advertisement -

భైంసా అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మజ్లిస్ చీఫ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు శాస్త్రీపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఓవైసీ..రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అవసరం.. అది ఏ ప్రాంతం అయిన ఏ రాష్ట్రం అయిన అందరూ కలిసి మెలసి ఉండాలన్నారు.

భైంసాలోనే ఒక్కచోట ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ అంతటా లా అండ్ ఆర్డర్ బాగానే ఉందని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. బీజేపీ వాళ్లు చిన్నపిల్లలు ఏమైనా అంటారని ఎద్దేవా చేశారు.

మజ్లిస్‌పై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఓవైసీ… పేద ముస్లింలను కాపడుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -