దళిత బంధును అడ్డుకుంది బీజేపీనే:మోత్కుపల్లి

57
mothukupalli
- Advertisement -

దళితబంధును అడ్డుకుంది బీజేపీనే అని విమర్శించారు టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి.. ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు.

ళితబంధు కొత్త పథకం కాదని, ఏడాది క్రితమే అమలైందన్నారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం కోసం పరితపించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మోత్కుపల్లి కొనియాడారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని దేశమంతా దళితబంధు అమలు చేయాలన్నారు.

దళిత బంధును అడ్డుకున్న ఈటెలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందన్నారు.

- Advertisement -