కన్న కొడుకులిద్దరిని కడతేర్చిన కసాయి తల్లి…!

221
Mother Killed Sons
- Advertisement -

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం సంఘటన జరిగింది. ఓ తల్లి తన కొడుకులపై ఇటుకలతో దాడి చేసిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. భార్య భర్తల మధ్య గొడవలతో ఓ కన్నతల్లి తమ పేగు బంధాన్ని తెంపుకుంది. తమ ఇద్దరు కుమారులను ఇటుకతో తలపై మోది హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది.

సప్తగిరి కాలనీలో నివాసం ఉండే బద్రి రమాదేవి శ్రీకాంత్‌కు ఇద్దరు కుమారులు గత రెండు రోజులుగా ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది. దీంతో భర్త ఇంట్లో లేని సమయంలో రమాదేవి ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అజయ్ (11) ఆర్యా (7) లను ఇంట్లోకి పిలిచి తలపై బలంగా ఇటుకతో మోదింది, పిల్లల కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికి పిల్లలిద్దరూ నెత్తుటి మడగులో కనిపించారు.

వేంటనే పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అజయ్(11) మరణించాడు. ఇక ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్యన్ కూడా మృతిచెందాడు సంఘటనా స్థలానికి పెద్దపల్లి డి.సి.పి సుదర్శన్ గౌడ్ చేరుకొని ఘటనపై వివరాలను సేకరించారు. భార్య భర్తల మధ్య గొడవలతోనే రమాదేవి ఈ ఘటనకు పాల్పడిందని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డి సి పి సుదర్శన్ గౌడ్ చెప్పారు. పిల్లల్ని హత్య చేసిన తల్లి రమా దేవి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -