మోస్ట్ డిజైరబుల్ ఉమెన్@2018

228
most desirabal woman 2018
- Advertisement -

తెలుగు సినీ, టీవీ, క్రీడా రంగాల్లో ఎంతో మంది యువతులు రాణిస్తున్నారు. వీరందరిలో 2018లో మోస్ డిజైరబుల్ ఉమెన్ ఎవరు? హైదరాబాదీ యువత ఎక్కువగా ఎవరినీ ఇష్టపడుతోంది? అని తెలుసుకునేందుకు హైదరాబాద్ టైమ్స్ సెకండ్ ఎడిషన్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో కొంత మంది మహిళలు తమ నటనతో ఆకట్టుకుంటే మరికొంతమంది తమ అందం,అభినయంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.

నిన్నే పెళ్లాడుతా సీరియల్‌లో మృదులగా అందరికీ సుపరిచితురాలైన బుల్లితెర నటి భూమి శెట్టి ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రదీప్ హోస్ట్‌గా వివాదాస్పదమైన షో పెళ్లిచూపులు విన్నర్‌ జ్ఞానేశ్వరి కండ్రేగుల రెండో స్థానాన్ని సంపాదించుకుంది.

యాంకర్ రష్మి 4వ స్థానంలో నిలవగా,యాంకర్ విష్ణుప్రియ ఐదవ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఎడిషన్‌లో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్న యాంకర్ వర్షిణి సౌందరరాజన్ సెకండ్ ఎడిషన్‌‌లో మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

బిగ్‌బాస్ 2 ఫేమ్ దీప్తి సునయన ,యాంకర్ శ్రీముఖి,అనసూయ 11,12,13వ స్ధానంలో సంపాదించుకున్నారు. మొత్తంగా 15 మంది ఉన్న మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో మన బుల్లితెర యాంకర్లు 5 స్థానాలను కైవసం చేసుకున్నారు.

- Advertisement -