మోర్తాడ్ ప్రజల రుణం తీర్చుకుంటాం: కవిత

69
kavitha mlc
- Advertisement -

మోర్తాడ్ ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. స్ధానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు బయలు దేరిన కవితకు మార్గంమధ్యలో మోర్తాడ్ మండల కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె…మోర్తాడ్ మండల ప్రజలు ఉద్యమ సయంలో కేసీఆర్‌కి అండగా నిలిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని తెలిపారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు.

- Advertisement -