మొక్కలు నాటిన ఎంపీ నామా…

67
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ…మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ పిలుపు మేరకు తాను జన్మదినోత్సవ సందర్భంగా మొక్కలు నాటుతున్నానని తెలిపారు. ఈసందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ మొక్కలు నాటడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-పౌంఢర్ రాఘవ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

వడగళ్లతో కూడిన వానలు..ఐఎండీ.!

మహిళా రిజర్వేషన్‌ బిల్లు..రౌండ్ టేబుల్ మీట్

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం..

- Advertisement -