ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు-మోహన్ బాబు

227
Mohan-Babu
- Advertisement -

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాదాల రంగారావు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన పార్థీవ దేహానికి  పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించి, దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇక నటుడు మోహన్ బాబుకు కూడా ఆయన పార్థీవ దేహానికి నివాళుల్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాదాల రంగారావు మరణం చిత్రసీమకు తీరని లోటు అన్నారు.

కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఒక నిబద్ధతతో సినిమాలు రూపొందించిన వ్యక్తి మాదాల రంగారావు. ఒక సిద్దాంతాన్ని నమ్మి, ఆ సిద్దాంతాన్ని ఆచరిస్తూ జీవించిన మంచి మనిషి ఆయన. నాకు మంచి స్నేహితుడు కూడా. అటువంటి వ్యక్తి మరణం నన్ను ఎంతో బాధించిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ షిరిడీ సాయినాధుని వేడుకొంటున్నాను మోహన్ బాబు పేర్కొన్నారు.

- Advertisement -