ట్విట్టర్ ట్రెండింగ్‌లో #ModiEnemyOfTelangana

42
modi
- Advertisement -

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్రం భగ్గుమంది. టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అన్నిమండల కేంద్రాల్లో ప్రధాని దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. ఇందులో భాగంగా #ModiEnemyOfTelangana అనే హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు కావస్తున్నప్పటికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై విషం చిమ్మడం, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్న నిరసన కారులు పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.

పార్లమెంటు సాక్షిగా ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మోదీ డౌన్‌డౌన్‌.. జైతెలంగాణ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి.

- Advertisement -