సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్…

204
modi
- Advertisement -

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ కొనసాగింపు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో నాలుగోసారి సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు మోడీ.

ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంతోపాటు లాక్‌డౌన్‌ సడలింపులపై ఎలా ముందుకు వెళ్లాలి? లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేక దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? తదితర విషయాలపై ప్రధాని చర్చిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.

మే 3 తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపనున్నారు ప్రధాని. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక ప్యాకేజీ, ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్బీఎం) చట్టానికి సవరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -