సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

236
modi
- Advertisement -

దేశంలోని అన్నిరాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్ డౌన్ 3.0 ముగిసిన తర్వాత భవిష్యత్‌లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సీఎంలతో చర్చించనున్నారు ప్రధాని.

దేశ ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన పరిస్ధితులపై చర్చించనున్నారు. ప్ర‌జా ర‌వాణా, ఆఫీసులు, వ్యాపార‌, వాణిజ్య, ఫ్యాక్ట‌రీలు ఎలా ప్రార‌భించాలి అనేదానిపై సీఎంల సలహాలు,సూచనలు అడిగి తెలుసుకోనున్నారు.

ప్ర‌జ‌ల జీవ‌నోపాధికి స‌మ‌స్య‌లు రాకుండా ఎలా ముందుకు వెళ్దాం అనే అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

- Advertisement -