MODi:మోదీ రాకతో…రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!

47
- Advertisement -

ఏప్రిల్‌ 8వ తేదీన భారత ప్రధాన మోదీ హైదరాబాద్‌కు వస్తుండటంతో సికింద్రాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఇదే స్టేషన్ నుంచి తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో పబ్లిక్ మీటీంగ్‌లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.

మోనప్ప జంక్షన్‌, గ్రీన్‌ లాండ్స్‌, ప్రకాశ్‌నగర్‌, రసూల్‌పురా సీటీఓ, ఫ్లాజా, ఎస్‌బీహెచ్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్డు, ఆలుగడ్డబావి, చిలకలగూడ జంక్షన్‌, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ రూట్లు, జంక్షన్ల వైపు వెళ్లకపోవడం మంచిదని ప్రయాణికులకు సూచించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలన్నారు. ఉప్పల్‌ – సికింద్రాబాద్‌ రూట్‌లో సైతం ట్రాఫిక్‌ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు.

తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ఎడమవైపు తీసుకొని ఏఎస్‌రావునగర్‌, ఈసీఐఎల్‌, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.

కీసర ఓఆర్‌ఆర్‌ గేట్‌ నుంచి ఈసీఐఎల్‌, మౌలాలీ, నాచారం, ఉప్పల్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.

కరీంనగర్‌ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌, జేబీఎస్‌ రూట్లలో వెళ్లకుండా ఓఆర్‌ఆర్‌పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.

అలాగే కరీంనగర్‌ వైపు నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా నగరంలోకి వచ్చే వారు ఓఆర్‌ఆర్‌ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, మూసాపేట్‌, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.

చిలకలగూడ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ జంక్షన్‌, రేతిఫైల్‌ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలకు అనుమతి ఉండదు.

ప్రయాణికులు క్లాక్‌ టవర్‌ పాస్‌పోర్టు అఫీస్‌, రెజిమెంటల్‌ బజార్‌ రూట్‌ను ఉపయోగించుకొని సికింద్రాబాద్‌ స్టేషన్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకోవాలి.

తివోలి ఎక్స్‌ రోడ్స్‌ నుంచి ఫ్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు ఇరువైపుల మూసేస్తారు.

ఎస్‌బీహెచ్‌ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి స్వీకార్‌.. ఉపకార్‌ జంక్షన్‌ వరకు ఇరువైపుల రోడ్డు మూసేస్తారు.

రాజీవ్‌ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌ పార్కు గ్రౌండ్‌, పికెట్‌ డిపో ప్రాంగణంలో, అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డులో పార్కు చేయాలి.

ఆర్టీసీ బస్సుల కోసం కరీంనగర్‌ రూట్‌లో వచ్చే దోబీఘాట్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మెదక్‌, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బిసన్‌ పోలో, రంగారెడ్డి, కర్నూల్‌, అచ్చంపేట్‌, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట్‌, వరంగల్‌, యాదాద్రి రూట్‌లో వచ్చే వారు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో పార్కు చేయాలి.

ఇవి కూడా చదవండి…

బొగ్గు బ్లాకుల వేలం..బీఆర్ఎస్ మహాధర్నా

TELANGANA:కేంద్రం ప్రకటించే అవార్డులన్ని తెలంగాణకే: హరీశ్‌

సొంతంగా వ్యాక్సిన్లు కొనుకోండి: కేంద్రం.!

- Advertisement -