మోడీ ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చిన థాక్రే

245
Modi-mukt Bharat says Raj Thackeray
- Advertisement -

ఇప్పటివరకు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ పిలుపునిచ్చిన బీజేపీ నేతలకు గట్టిషాక్ తగిలింది. భారతదేశానికి మోడీ నుంచి విముక్తి కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌)చీఫ్ రాజ్ థాక్రే. నోట్ల రద్దు స్వతంత్ర్య భారతావనిలో పెద్ద కుంభకోణమని తెలిపారు. మరోవైపు థాక్రే పిలుపుతో ముంబైలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

గుజరాతీల దుకాణాలపై ఆందోళన కారులు దాడుల చేస్తున్నారు. పలు షాపులను ధ్వంసం చేశారు. ఎంఎన్‌ఎస్ శ్రేణుల దాడులతో గుజరాతీలు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. మరోవైపు 2019 నాటికి మోడీ ముక్త్ భారత్‌ కోసం తన ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు థాక్రే.

మోడీ నుంచి భారతావనికి విముక్తి కలిగించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. నీరవ్ మోడీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శ్రీదేవి అంత్యక్రియలకు కావాలనే హడావిడి చేశారని ఆరోపించారు.శ్రీదేవి గొప్పనటి కావొచ్చు..కానీ ఆమె దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. మోడీ సర్కార్ అంటే మీడియాకు భయమని..ఎన్డీయే హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేయాలన్నారు.

- Advertisement -