మొక్కలు నాటిన కాళ భైరవ, శ్రీసింహ

37
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రామానాయుడు స్టూడియో ఆవరణలో మొక్కలు నాటారు నటుడు శ్రీ సింహ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ.

ఈ సందర్భంగా శ్రీ సింహ మరియు కాళ భైరవ మాట్లాడుతూ సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమని అన్నారు.మొక్కలు ఎన్ని నాటుతే అంత మనకు మరియు మన వాతావరనానికి అంత మంచిది అన్నారు. రెజినా ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి మేము మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం లో మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు.

మొక్కలు నాటడం వాటి సంరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం డైరెక్టర్ సందీప్ రాజ్, అశ్విన్ గంగరాజు నామినేట్ చేయగా డైరెక్టర్ ప్రణీత్ గంగరాజు మరియు ఛాలెంజ్ ఇవ్వకపోయినా ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని శ్రీ సింహ కోరారు.

green

- Advertisement -