గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి..

169
srinivas reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి . గత మూడు రోజులుగా వానచినుకులు ఎడతెరపి లేకుండా కురుస్తున్నా , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాత్రం వర్షం తో పోటీపడుతోంది.

ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని , ఎంపీ సంతోష్ కుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలియజేసి , గ్రీన్ ఛాలెంజ్ విసిరారు . దానిని స్వీకరించి వరంగల్ లో తన నివాసంలో మూడు మొక్కలు నాటరు .

ఈ సందర్బంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పుట్టిన రోజున మూడు మొక్కలు నాటాలి అనే ఆలోచన ప్రతిఒక్కరు ఆచరించేలా చేయడంలో ఎంపీ సంతోష్ కుమార్ గారి కృషి అభినందనీయం . అనతికాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , దేశమంతా ప్రజాదరణ పొందింది , ప్రాంతాలకు అతీతంగా మొక్కలు నాటి , వాటిని కాపాడే విదంగా చర్యలు తీసుకుంటూ , పర్యావరణ పరిరక్షణ కి తోడ్పాటు అందిస్తున్నా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు . ఈ కార్యక్రమం ఇలానే విజయవంతంగా ముందుకు సాగాలని , వి శ్రీనివాస్ రావు గారు , కరణం ఫణి ప్రసాద్ గార్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విసిరారు .

- Advertisement -