23న నామినేషన్ వేయనున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి..

160
palla
- Advertisement -

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. మూడు పాత జిల్లాలతో కూడిన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ముఖ్యనేతలను, ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను, శ్రేణులను, పట్టభద్ర ఓటర్లు, మిత్రులను తన నామినేషన్‌ కార్యక్రమానికి ఆహ్వానించారు.

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్న పల్లా.. తనకు మద్దతుగా నామినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి పార్టీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -