ఉత్తమ్ కి ఓటమి భయం పట్టుకుందిః ఎమ్మెల్సీ పల్లా

452
- Advertisement -

 హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపొతామని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. హుజుర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ నుంచి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామిరెడ్డి అతని అనుచరులు టీఆర్ఎస్ లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ ను అభివృద్ది చేశాను అంటే ప్రజలు నవ్వుతున్నారు.

హుజుర్నగర్ పట్టణంలోని శివారు కాలనీలాల్లో ప్రజలు సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. ఉత్తమ్ అహంకారం తో కాంగ్రెస్ కి నాయకులు ఒక్కొక్కరు దూరం అవుతూ trs లో చేరుతున్నారు. ఎన్నికల తరువాత హుజుర్నగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. హుజుర్ నగర్ ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. హుజుర్ నగర్ ఓటర్లు పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ కు ఓటు వేసి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -